ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు దుర్మరణం - Sakshi


నందిగామ: హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి తర్వాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలో బైపాస్‌ రోడ్డుపై చోటుచేసుకుంది. హైదరాబాద్‌ లింగంపల్లి నుంచి ఐదుగురు వ్యక్తులు ఇండికా కారు(ఏపీ 28టీవీ 4004)లో కర్నూలు జిల్లా గూడురుకు బయలుదేరారు. నందిగామ వద్దకు రాగానే ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇందులో నలుగురు అక్కడిక్కడే చనిపోగా, మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.



మృతులలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. మృతులను సోమన్న, నరసమ్మ, సోమేశ్‌, గిద్దమ్మలుగా గుర్తించారు. అతివేగంగా వచ్చి లారీని ఢీకొట్టడంతో కారు ముందుభాఆగం పూర్తిగా లారీ వెనకభాగంలోకి చొచ్చుకుపోయింది. దీంతో మృతదేహాలను బయటకు తీయడానికి చాలా సమయం పట్టింది. మృతులు కర్నూలు జిల్లా గూడురు మండలానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top