ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం


హైదరాబాద్‌: ఇండియన్‌  ఎయిర్‌లైన్స్‌-467 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన విమానం అత్యవసరంగా సోమవారం రాత్రి శంషాబాద్‌ విమానశ్రయంలో దింపేశారు.



ఈ రోజు రాత్రి 8 గంటలకు విజయవాడ చేరాల్సిన విమానంలో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top