2500 కోట్లు పెరగనున్న మెట్రోరైలు వ్యయం!
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న హైదరాబాద్ మెట్రోరైలు పనుల వ్యయం దాదాపు 2,500 నుంచి 3వేల కోట్ల వరకు పెరగనుంది. ఈ విషయాన్ని ఎల్అండ్టీ మెట్రోరైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్టీఎంఆర్హెచ్ఎల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ వీబీ గాడ్గిల్ తెలిపారు. నిర్మాణ ముడిసరుకు ధరలు పెరగడం వల్లే ఖర్చు ఈ మేరకు పెరిగిందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు చాలా చాలా కీలకదశలో ఉందని చెప్పారు. సుల్తాన్బజార్, అసెంబ్లీ దగ్గర మెట్రోరైలు అలైన్మెంటుకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అలైన్మెంటు మారితే మరో 1500 కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ప్రాజెక్టు ఇప్పటికి 28 శాతం పూర్తయిందని, అన్ని రకాల సమస్యలను తాము అధిగమిస్తామన్న విశ్వాసం ఉందని గాడ్గిల్ అన్నారు. 2010లో కన్సెషనరీ ఒప్పందం కుదిరే సమయానికి మెట్రోరైలు ప్రాజెక్టు వ్యయం రూ. 14,132 కోట్లని ఆయన తెలిపారు. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ఎల్అండ్టీ సంస్థ 72 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు