ఢిల్లీలో సైబర్ క్రైమ్ పోలీసుల దాడులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాడుల్లో భాగంగా ఓ నైజీరియన్ ఇంటిపై దాడి చేసి, అక్కడ నిల్వ ఉంచిన రూ.10కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న జాన్ దాబ్రిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అతడిని పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకు వచ్చేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.