స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ లో భారీ కుంభకోణం


హైదరాబాద్‌: స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ చైతన్యపురి శాఖ మేనేజర్‌ మురళినాయక్‌ ఇందుకు సూత్రధారిగా భావిస్తున్నారు. అనర్హులకు రుణాలు మంజూరు చేసి రూ. 3 కోట్ల మేర ధనాన్ని దుర్వినియోగం చేసిన మేనేజర్‌ తన తప్పు బయట పడేసరికి ఓ రియల్‌ ఎస్టేట్‌ కన‍్సల్టెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే, బ్యాంకు లీగల్‌ సెల్‌ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టి మురళినాయక్‌ను దోషిగా తేల్చారు. ఈ మేరకు అతడినిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్నారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top