బాలికపై ఇంటి యజమాని దారుణం


హైదరాబాద్ : నగరంలోని బోరబండలో దారుణం చోటుచేసుకుంది. బాలికను నిర్బంధించి ఇంటి యజమాని రెండు నెలలుగా  అత్యాచారానికి పాల్పడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది.


దీంతో బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులు మంగళవారం ఉదయం సాక్షి టీవీని ఆశ్రయించారు. సాక్షి టీవీ చొరవతో వాళ్లు షీ టీమ్ చీఫ్ స్వాతిలక్రాను కలిశారు. స్వాతి లక్రా ఆదేశం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. నిందితునిపై కఠినచర్యలు తీసుకుంటామని స్వాతి లక్రా తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top