ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత


హైదరాబాద్: కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద గురువారం తెల్లవారుజామున ఉద్రిక్తత నెలకొంది. జూడాలు దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు. దీంతో పోలీసుల ప్రయత్నాన్ని జూడాలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జూడాలు, పోలీసుల మధ్య తీవ్ర తొపులాట చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


ఈ 50 మంది జూడాలను పోలీసులు అదుపులోకి తీసుకుని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్కు తరలించారు. జూడాలు గ్రామీణ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలని తెలంగాణ ప్రభుత్వం జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top