హోదా తెస్తామన్న వాళ్లు ఏం చేస్తున్నారు?
సినీ నటుడు నందమూరి హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చినప్పుడే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు ఘననివాళి ఆర్పించినట్టు అవుతుందని సినీ నటుడు నందమూరి హరికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నవారు మోసం చేశారని, తెస్తామన్న వాళ్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మహనాడు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నపై ఆయన స్పందిస్తూ.. ఎన్టీఆర్కి నివాళులర్పించేదే తనకు మంచి కార్యక్రమమని, ఆయన ఆశయ సాధనే గొప్ప కార్యక్రమమని బదులిచ్చారు.