మరో 569 కిలోమీటర్లకు పచ్చజెండా

మరో 569 కిలోమీటర్లకు పచ్చజెండా


కొత్త జాతీయ రహదారులకు కేంద్రం అనుమతి: తుమ్మల



సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం తెలంగాణకు మరో 569 కిలోమీటర్ల నిడివి గల కొత్త జాతీయ రహదారులకు అనుమతించిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వీటి నిర్మాణానికి రూ.3,615 కోట్లు ఖర్చవుతుందన్నారు. శనివారం ఇక్కడ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జాతీయ రహదారుల విభాగం ఈఎన్‌సీ గణపతిరెడ్డి, రాష్ట్ర రహదారుల విభా గం ఈఎన్‌సీ రవీందర్‌రావుతో కలసి మంత్రి సమీక్షించారు. తెలంగాణ సమర్పించిన ప్రతి పాదనలకు కేంద్రం అంగీకారం తెలిపిందని మంత్రి విలేకరులకు తెలిపారు.



జగిత్యాల–రాయపట్నం, రాయపట్నం– జైపూర్, కాలి బుర్గి– యద్గీర్‌–కృష్ణ, గెండెపాడ్‌–నీరుకుళ్ల, సిరోంచ–ఆత్మకూరు, జనగామ–దుద్దెడ–ఖమ్మం–కురవి, నిజాంపేట–బీదర్, కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, హైదరాబాద్‌–నర్సాపూర్‌–మెదక్, బాసర–భైంసా, సిద్దిపేట–ఎల్కతుర్తి, జహీరాబాద్‌–బీదర్‌ రోడ్లకు కేం ద్రం అనుమతించిందన్నారు. అలాగే మొత్తం 85 సీఆర్‌ఎఫ్‌ రోడ్లకు అనుమతి వచ్చిందన్నారు. డీపీఆర్‌లు సిద్ధం చేసి కేంద్రానికి పం పి ఆమోదం పొందేలా చూడాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. వీటితో పాటు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, కలెక్టరేట్‌ భవనాలు, కలెక్టర్, అధికారుల నివాస భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఆదేశించినట్టు చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top