ఉజ్జయిని మహంకాళికి బంగారు జడమాల

ఉజ్జయిని మహంకాళికి బంగారు జడమాల


జంటనగరాల వాసులు కొంగు బంగారంలా భావించే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మరో సరికొత్త ఆభరణం చేరింది. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు అమ్మవారికి బంగారంతో జడమాల చేయించారు.



తలాచిగూడ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త ధర్మపురి పద్మారావు 8.5 తులాల బంగారంతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జడమాల చేయించారు. ఈ ఆభరణాన్ని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా దేవస్థానం ఈవోకు అందజేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top