ఎయిర్పోర్ట్లో ఐఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం


హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక దంపతుల నుంచి కిలోన్నర బంగారం, 8 ఐఫోన్లతోపాటు 10 ల్యాప్టాప్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం... సింగపూర్ నుంచి ఆ దేశ ఎయిర్లైన్స్ విమానంలో నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల లగేజీలను తనిఖీలు నిర్వహించారు.


ఈ సందర్బంగా సదరు దంపతుల లగేజీలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఆ లేగేజీలోని ఐఫోన్లు, ల్యాప్టాప్లకు కూడా ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో వాటీని కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆ దంపతులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top