'ఖైదీల ఆత్మహత్యలు నివారించాలి'


హైదరాబాద్: చర్లపల్లి కారాగారంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని నిరోధించడానికి పటిష్టమైనచర్యలు తీసుకోవాలని సీపీఐ విజ్ఞప్తి చేసింది. రెండురోజుల్లో రెండు ఆత్మహత్యలు జరగడం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి రాసిన లేఖలో ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.



నేరస్తులు, ముద్దాయిలుగా రిమాండ్‌లో ఉన్న వారికి రక్షణ కల్పించాల్సిన నైతికబాధ్యత ప్రభుత్వానిదన్నారు. ఖైదీలు ఆత్మహత్యలు చేసుకోకుండా, వారిపై ఇతరులు దాడి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యతను జైలు సంస్కరణలు గుర్తుచేస్తూనే ఉంటాయన్నారు. ఈ అంశాలపై అధికారులకు తగిన ఆదేశాలివ్వాలని కోరారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top