జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకూ హెల్త్‌కార్డులు

జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకూ హెల్త్‌కార్డులు


సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీహెచ్‌ఎంసీలోని రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్‌కార్డులు జారీ చేయనున్నారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్‌కు ఈ విషయాన్ని తెలిపారు. హెల్త్‌కార్డులతోపాటు అర్హులైన వారికి పదోన్నతులు, బదిలీలు కూడా జరిపేందుకు కమిషనర్ హామీ ఇచ్చారని గోపాల్ విలేకరులతో  అన్నారు. త్వరలోనే పీఆర్‌సీ అమలు కూడా జరుగనున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ సర్కారు ఉద్యోగుల పక్షపాతిగా వ్యవహరిస్తోందని అన్నారు. హెల్త్‌కార్డులతో నగదు లేకుండానే ఏ ఆస్పత్రిలోనైనా వైద్యచికిత్సలు చేయించుకోవచ్చునన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top