జీహెచ్ఎంసీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి
జీహెచ్ఎంసీ పాలకమండలి ఐదుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంది. మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి మేయర్ బి.రామ్మోహన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల కార్పొరేటర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మైనార్టీ కోఆప్షన్ సభ్యులుగా టీఆర్ఎస్కు చెందిన విద్యా స్రవంతి, ఎంఐఎంకు చెందిన ఎండీ హుస్సేన్లను ఎన్నుకున్నారు. అలాగే, మేథావి వర్గం నుంచి గొట్టిముక్కల జ్యోతి, రాజుగుప్తా, సి.న ర్సింహారావులను ఎన్నుకున్నారు. అనంతరం వారంతా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కాగా, ఈ సమావేశానికి బీజేపీ, టీడీపీ కార్పొరేటర్లు హాజరు కాలేదు.