నాలుగేళ్ల బాలిక కిడ్నాప్
హైదరాబాద్: ఇటీవల కాలంలో డబ్బు కోసం పిల్లలను కిడ్నాప్ చేయడం ఎక్కువైపోయింది. కుషాయిగూడ నాగార్జున నగర్లో ఈరోజు నాలుగేళ్ల బాలిక జాహ్నవిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ బాలికను ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయం తెలియలేదు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
**