జీడిమెట్లలో అగ్ని ప్రమాదం


జీడిమెట్ల(హైదరాబాద్): జీడిమెట్లలోని ఒక ప్రింటింగ్ యూనిట్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కార్తికేయ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ప్రింటింగ్ ప్రెస్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం సంభవించిందని నిర్వాహకుడు రామ్హ్రీమ్ తెలిపారు. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు ఆయన చెప్పారు. జనావాసాల మధ్య ఉన్న ఈ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్థానికులు స్పందించి మంటలు ఆర్పివే శారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top