మెడికల్ షాపులో అగ్నిప్రమాదం


రాజేంద్రనగర్(హైదరాబాద్): ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించి మెడికల్ షాపు పూర్తిగా కాలిపోయిన సంఘటన నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలోని పీడీపీ చౌరస్తాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మెడికల్ షాపులో ఉన్న సుమారు రూ. 4 లక్షల విలువైన మందులు మంటల్లో బుడిదయ్యాయి.


తెల్లవారుజామున మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కరమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top