భారత్ గ్యాస్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి: రాజేంద్రనగర్ బండ్లగూడలోని భారత్ గ్యాస్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించిది. బుధవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.