' సెయింట్ జోసెఫ్' లో ఘర్షణ, విద్యార్థి మృతి
హైదరాబాద్ : హైదరాబాద్లో దారుణం జరిగింది. ఇద్దరి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ...చివరికి ఒకరి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే అబిడ్స్ కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో మంగళవారం సాయంత్రం ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి సిద్ధిఖీ బుధవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విద్యార్థుల మధ్య ఇంతటి తీవ్రమై ఘర్షణ జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.