డూప్లికేట్ నోటుతో బిచ్చగాడికే బురిడీ
హైదరాబాద్ :
బిచ్చమొత్తుకుని జీవిస్తున్న ఓ వృద్ధున్ని ఓ దుండగుడు నకిలీ నోటుతో మోసం చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని కృష్ణ నగర్ ఏ బ్లాక్లోని అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. మహా శివరాత్రి సందర్బంగా బిక్షాటన చేస్తున్న గుంటూరుకు చెందిన గురయ్యా (65 ) అనే వృద్ధుడిని ఓ మోసగాడు తన వద్ద 2000 నోటు ఉందని చెప్పి, దానికి చిల్లర కావాలని కోరాడు. మనిషి హుందాగా ఉండటంతో మోసగాడు అనే అనుమానం రాలేదు. ఆ వ్యక్తి రెండు వేల నోటు ఇచ్చి చేంజ్ తీసుకొని వెంటనే ఉడాయించాడు.
బిచ్చగాడు నోటును పరిశీలించే లోపలే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో బిచ్చగాడు నోటును పరిశీలించి పక్కవాళ్లకు చూపించగా దొంగ నోటు అని వాళ్లు చెప్పడంతో ఆ వృద్ధ బుచ్చగాడు లభో దిభో మంటూ వేదన చెందాడు. ఇంతలో విషయం తెలుసుకున్న అక్కడి వారు ఆ మోసగాడిని వెతకడానికి వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నాళ్ల నుంచో దాచుకున్న డబ్బు పోయేసరికి ఆ నోటును అక్కడే పడేసి ఏడ్చుకుంటూ వృద్ధ బిచ్చగాడు వెళ్ళిపోయాడు.