'మెరిట్ ఆధారంగా ప్రమోషన్లు వద్దు'

'మెరిట్ ఆధారంగా ప్రమోషన్లు వద్దు' - Sakshi

హైదరాబాద్ : మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలనుకోవడం సరికాదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. ప్రమోషన్లను సీనియారిటీ ఆధారంగా పాత పద్ధతిలోనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉద్యోగులలో తీవ్రమైన వ్యతిరేఖత ఉందని మురళీకృష్ణ పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రమోషన్ల వివాదం అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top