నన్ను ఎన్‌కౌంటర్ చేయొద్దు: ఎల్లంగౌడ్


సాక్షి, హైదరాబాద్: దయచేసి తనను ఎన్‌కౌంటర్ చేయొద్దని నకిలీ నోట్ల తయారీ ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ పోలీసులను వేడుకుంటున్నట్లుగా ఉన్న సీడీలు కలకలం రేపాయి. ఈ సీడీలు గురువారం పలు మీడియా సంస్థల కార్యాలయాలకు చేరాయి. అందులో తనను ఎన్‌కౌంటర్ చేయొద్దని, పోలీసుల ముందు లొంగిపోతున్నానని ఉంది.



ఎల్లంగౌడ్ మంగళవారం సైబరాబాద్ పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఈ సీడీలను రూపొందించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అలాగే, సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్‌వోటీ) పోలీసులు మెదక్ జిల్లా సిద్దిపేటలోని ఎల్లంగౌడ్ ఇంట్లో గురువారం సోదాలు నిర్వహించారు. స్కానర్‌తోపాటు ఇతర వస్తువులు, నకిలీ నోట్లు లభించినట్లు తెలిసింది.   

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top