ఎంసెట్ -2 లీక్పై నేడు ప్రభుత్వానికి నివేదిక


హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీక్పై నేడు ప్రభుత్వానికి నివేదిక సీఐడీ ఇవ్వనుంది. ఈ నివేదికను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఎంసెట్ -2 లీకేజీలో అదుపులోకి తీసుకున్న తిరుమల్, విష్ణులను పోలీసులు రిమాండ్కు తరలించారు. అలాగే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని... రహస్య ప్రదేశంలో సీఐబీ అధికారులు విచారిస్తున్నారు.


ఈ కేసులో ప్రధాన సూత్రధారుల కోసం సీఐడీ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే ఎంసెట్ -2 లీకేజీపై నగరంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు సచివాలయం, మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.    

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top