ప్రతిపక్షాలది చిల్లర రాజకీయం
దూదిమెట్ల బాలరాజ్
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరల పంపిణీపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని బీసీ జేఏసీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తే, దాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో అల్వాల జితేందర్, వడ్డపల్లి మాధవ్, శ్రీకాంత్యాదవ్, వినీల్, ప్రవీణ్ పాల్గొన్నారు.