ఉపాధిహామీతో వ్యవసాయాన్ని జోడించొద్దు

ఉపాధిహామీతో వ్యవసాయాన్ని జోడించొద్దు - Sakshi


సీపీఎం కార్యదర్శి తమ్మినేని

సాక్షి, హైదరా బాద్‌: ఉపాధిహా మీతో వ్యవసా యాన్ని జోడించా లనే సీఎం కేసీఆర్‌ ప్రతిపాదన అభి వృద్ధి నిరోధకమైనదని, దీన్ని వెంటనే విరమించుకోవాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ఉపాధిహామీ మూల సిద్ధాంతానికే ఇది వ్యతిరేకమని, వ్యవసాయ కూలీల ఉపా ధికి, వారి పనిరోజులకు గండి కొట్టేందుకు ఇది దోహదపడుతుందన్నారు.


రైతులు, ప్రజలను భ్రమల్లో ముంచే చర్యలకు కేసీఆర్‌ స్వస్తి పలికి తమ ప్రకటనలను ఆచరణలో చూపాలని చెప్పారు. సోమ వారం విలేకరులతో మాట్లాడుతూ రైతు లకు ఇవ్వదలుచుకున్న సహాయాన్ని వచ్చే ఏడాది కాకుండా వెంటనే ఇవ్వాలన్నారు. కష్టాల్లో ఉన్న  మిర్చి రైతులను ఆదుకునేం దుకు మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటాల్‌ రూ.10 వేలకు కొనుగోలు చేయాలన్నారు. ఒకే సారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వ హించడం సాధ్యం కాదన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top