భావోద్వేగాలతో పబ్బం గడుపుతున్నారు :డీకే అరుణ

భావోద్వేగాలతో పబ్బం గడుపుతున్నారు :డీకే అరుణ


 టీఆర్‌ఎస్ నేతలపై డీకే అరుణ ఫైర్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయాలు చే యడం, పబ్బం గడుపుకోవడం తప్ప సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల నే ఆలోచన టీఆర్‌ఎస్‌కు లేదని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే డి.కె.అరుణ అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ, సాగునీరందించే చిత్తశుద్ధి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు లేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్, అంచనాలు పెంపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అవి బయటకు రాకుండా ఉండటానికే కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారాలకు హరీశ్ దిగుతున్నారన్నారు.


పాలమూరు ఆలోచన కాంగ్రెస్ పార్టీదేనని.. కొత్తగా కాంగ్రెస్ వైఖరి ఏమిటని అడగడం హరీశ్ అజ్ఞానం, అహంకారానికి నిదర్శనమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 8లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే 4 ప్రధాన ప్రాజెక్టుల 90 శాతం పనులు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ప్రాజెక్టుల దగ్గర నిద్రపోతూ హరీశ్ కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారని, పని చేయకుంటే ఆయన మాదిరే ప్రాజెక్టులు కూడా పడుకుంటాయన్నారు. టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top