లింగ ప్రాధాన్యంపైనే కీలక చర్చ
⇒ ముగిసిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు
⇒ సదస్సులో పాల్గొన్న ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) నిర్వహించిన సదస్సు ముగిసింది. లండన్లోని విల్టన్ పార్కులో మూడు రోజులపాటు జరిగిన సదస్సుకు మొత్తం 16 దేశాలకు చెందిన 24 మంది మహిళా ఎంపీలు హాజరయ్యారు. సదస్సులో ప్రధానంగా లింగ ప్రాధాన్యం పై చర్చించినట్లు ఇందులో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. లింగవివక్ష రూపాలను వివరించడంతో పాటు రాజకీయాలు, న్యాయ రంగాల్లో నెలకొన్న వివక్షపైనా చర్చించామన్నారు.
సభ్యులు తమ విజయ గాథలను మిగతా దేశాల సభ్యులతో పంచుకున్నారని, సదస్సు స్ఫూర్తినిచ్చిం దని, మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించామని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సదస్సుకు సీపీఏ సెక్రటరీ జనరల్ అక్బర్ ఖాన్, ప్రివిలేజెస్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ ఎం.లేఖి నాయకత్వం వహించారన్నారు.