అనుభవమంటే అబద్ధాలు చెప్పడమేనా?
చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తిన ధర్మాన
సాక్షి, హైదరాబాద్: ప్రజల తరపున ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వారి సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే ఆయనకేమీ తెలియదని సీఎం చంద్రబాబు అవమానించే రీతిలో మాట్లాడడం గర్హనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ ఏపీ విభాగం ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. చంద్రబాబు దృష్టిలో అనుభవం అంటే ప్రజలకు అబద్ధాలు చెప్పడమేనా? అని ఆయన ప్రశ్నించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మాన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.