తోటకూరనాడే చర్యలు తీసుకుని ఉండాల్సింది
ఇసుక మాఫియాపై ధర్మాన వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ఇసుకమాఫియాపై చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు చేసిన ప్రకటన చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు.
ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ తోటకూరనాడే చర్యలు చేపట్టినట్లయితే ఇసుకమాఫియాను అదుపుచేయడానికి వీలయ్యేదని, వందల కోట్ల ప్రజాధనాన్ని కాపాడినట్లయ్యేదన్నారు. ఏర్పేడు ప్రమాదానికి ముఖ్యమంత్రి చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.