ఆంక్షలు పౌర హక్కులకు భంగకరమే: దాసరి

ఆంక్షలు పౌర హక్కులకు భంగకరమే: దాసరి - Sakshi


ముద్రగడ దీక్షకు సంఘీభావం



 సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభం ఇంటికి ఎవ్వరూ వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పౌరహక్కులకు భంగం కలిగించడమే అని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ముద్రగడ దీక్షకు సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తున్నట్టు చెప్పారు. దీక్ష జరుగుతున్న కిర్లంపూడి గ్రామానికి  కాపులు వెళ్లకూడదన్న నిబంధన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top