ఏడవ రోజుకు చేరుకున్న సీపీఎం పాదయాత్ర
హయత్నగర్(రంగారెడ్డి జిల్లా): సీపీఎం తలపెట్టిన పాదయాత్ర ఆదివారంతో 7వ రోజుకు చేరుకుంది. తెలంగాణ సీపీఎం అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం హయత్నగర్ మండల పరిధిలో పార్టీ నాయకులతో కలిసి వివిధ గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీపీఎం పాదయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలికారు.
తమ పాదయాత్రపై విమర్శలు చేస్తున్న మంత్రులు, టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గిరిజనులకు చేసిన సేవలపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి చందూలాల్కు సవాల్ విసిరారు.