బోనాల ఉత్సవాలకు కంట్రోల్ రూమ్


యాకుత్‌పుర: హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సర్దార్ మహల్ జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని జోనల్ కమిషనర్ ఎం. బాలసుబ్రమణ్యం రెడ్డి తెలిపారు.



ఈ కంట్రోల్ రూమ్‌లో జీహెచ్‌ఎంసీలోని ఆరోగ్యం, పారిశుధ్యం, ఇంజనీరింగ్, సీపీడీసీఎల్, రెవెన్యూ, జలమండలి అధికారులు అందుబాటులో ఉంటారని.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 040-24500254లో సమాచారం అందించాలని సూచించారు. మూడు షిఫ్టులలో 24 గంటల పాటు అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top