జిల్లాల్లో కాంగ్రెస్ రైతు భరోసాయాత్రలు: ఉత్తమ్

జిల్లాల్లో కాంగ్రెస్ రైతు భరోసాయాత్రలు: ఉత్తమ్ - Sakshi


హైదరాబాద్ : తెలంగాణ జిల్లాల్లో రైతు భరోసాయాత్రను కాంగ్రెస్ పార్టీ చేపట్టనుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం నుంచి ఈ యాత్రను ప్రారంభించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 6న మహబూబ్ నగర్, 7న మెదక్, 8న ఖమ్మం, 9న వరంగల్, 11న నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసాయాత్రలు చేపడుతామని ఉత్తమ్ వివరించారు.



ఈ 10న రాష్ట్ర బంద్ సందర్భంగా ఆరోజు యాత్ర లేదని చెప్పారు. అప్పులబాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు, రైతులలో ధైర్యాన్ని నింపేందుకు తమ పార్టీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని టీపీసీసీ చీఫ్ వివరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top