మేయర్ చాంబర్ ఎదుట ఉద్రిక్తత


హైదరాబాద్: నగరంలో నరక ప్రాయంగా మారిన రహదారుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మేయర్ చాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో కార్యకర్తలు ఒక్కసారిగా చాంబార్లోకి చొచ్చుకెళ్లడానికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.



 

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top