బాలుడి కిడ్నాప్.. రూ. 10 లక్షల డిమాండ్
కుషాయిగూడ ప్రాంతంలో ఓ పదేళ్ల అబ్బాయిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. స్కూలుకు వెళ్లిన రోహిత్ తిరిగి రాలేదు. దాంతో తమ కొడుకును ఎవరో కిడ్నాప్ చేసినట్లు అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ కొడుకును క్షేమంగా విడిచిపెట్టాలంటే 10 లక్షల రూపాయల మొత్తం చెల్లించాల్సిందిగా కిడ్నాపర్ల నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే విచారణ ప్రారంభించారు.