నగరం శోభాయమానం
నగరం ఆధ్యాత్మిక సందడితో తొణికిసలాడుతోంది. ఓపక్క బతుకమ్మ సంబరాలు సాగుతుంటే.. దసరాను పురస్కరించుకుని మంగళవారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
గోపురాలు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. తొలిరోజు అమ్మవారు విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పలు ప్రాంతాల్లో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పి పూజలు ప్రారంభించారు. - సాక్షి, సిటీబ్యూరో