చికెన్ తిని చూపించిన మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, పద్మారావు, మాజీ ఎంపీ అంజన్లు చికెన్ మస్తుగా ఆరగించారు. మరోలా అనుకోకండీ. ఈ రోజు సికింద్రాబాద్లో జరిగిన చికెన్ మేళాలో వారు పాల్గొన్నారు.
తెలంగాణలో బర్డ్ఫ్లూ లేదని, చికెన్, గుడ్లు నిరభ్యంతరంగా తినవచ్చని చెప్పడానికే వారు అలా ఆరగించారు. ఆ తరువాత మంత్రులు మాట్లాడుతూ చికెన్, గుడ్లు తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు.