ఇక చెక్‌లు చెల్లవు..


హైదరాబాద్ సిటీ: ఇకమీదట హైదరాబాద్ మహానగరంలో నీటి సరఫరా, పారిశుధ్య బోర్డు నీటి బిల్లులకు సంబంధించిన చెల్లింపులు కేవలం ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి. చెక్‌ల ద్వారా చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఆదివారం తెలియజేశారు. ఈ చెల్లింపులు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయి.


వినియోగదారులు www.esevaonline.telangana.gov.in, www.meeseva.gov.in, www.aponline.gov.in, www.hyderabadwater.gov.in లలో ఏదేని వెబ్‌సైట్ ద్వారా చెల్లించవచ్చు. అన్ని పనిరోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top