వాణిజ్య పన్నుల శాఖ హోదాల్లో మార్పు


సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు నేపథ్యంలో రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారుల హోదాల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వస్తు సేవల పన్నుల చట్టం ప్రకారం ఈ శాఖలోని పోస్టులకు కొత్త పేర్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.



ఈ ఉత్తర్వులపై వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎల్‌.సంధ్యారాణిరావు సీఎం కేసీఆర్‌కు, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.



Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top