అందరికంటే ముందుంటాం: చంద్రబాబు
హైదరాబాద్: విభజన చట్టంలో పెట్టిన అన్ని హామీలను అమలు చేసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో అందరికంటే ముందు ఉంటామని చెప్పారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే...
* రాష్ట్ర విభజనకు హేతుబద్ధత లేదు. ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించారు
* రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని మొదటి నుంచి కోరుతున్నా
* విభజన చేయాలంటే ఏపీకి న్యాయం చేయమని కోరా
* సమైక్యంగా ఉంచాలనుకుంటే తెలంగాణకు న్యాయం చేయమన్నా
* విభజన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది
* ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ పాటు పడుతుంది
* భావితరాల భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నాం
* రాష్ట్ర హక్కులు కాపాడడంలో అందరికంటే ముందు ఉంటాం
* ప్రజలు ధైర్యంగా ఉండేందుకు సభ ద్వారా మనం భరోసా ఇవ్వాలి