అందరికంటే ముందుంటాం: చంద్రబాబు


హైదరాబాద్: విభజన చట్టంలో పెట్టిన అన్ని హామీలను అమలు చేసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో అందరికంటే ముందు ఉంటామని చెప్పారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే...



* రాష్ట్ర విభజనకు హేతుబద్ధత లేదు. ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించారు

* రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని మొదటి నుంచి కోరుతున్నా

* విభజన చేయాలంటే ఏపీకి న్యాయం చేయమని కోరా

* సమైక్యంగా ఉంచాలనుకుంటే తెలంగాణకు న్యాయం చేయమన్నా

* విభజన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది

* ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ పాటు పడుతుంది

* భావితరాల భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నాం

* రాష్ట్ర హక్కులు కాపాడడంలో అందరికంటే ముందు ఉంటాం

* ప్రజలు ధైర్యంగా ఉండేందుకు సభ ద్వారా మనం భరోసా ఇవ్వాలి

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top