విమానం ప్రయాణికుడికి గుండెపోటు ... మృతి
హైదరాబాద్: రాయపూర్ నుంచి హైదరబాద్ చేరుకున్న ఇండిగో విమానంలోని ప్రయాణికుడు సల్మాన్ షేర్ఖాన్కి శనివారం ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో అతడిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచాడు. దాంతో అతడి మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ షేర్ఖాన్ మృతిపై అతడి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.