షేక్‌పేట్లో బోల్తా పడిన కారు: ఒకరి మృతి


హైదరాబాద్: మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటన నగరంలోని టోలీచౌకీ సమీపంలోని షేక్‌పేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.



అదుపుతప్పిన కారు పల్టీలు కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top