గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య
జవహర్నగర్: హైదరాబాద్ మహా నగరం జవహర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తిని కొందరు దుండగులు శనివారం రాత్రి అతి కిరాతకంగా హత్య చేశారు. శవాన్ని గుర్తుపట్టడానికి వీలులేకుండా పెట్రోలు పోసి తగలబెట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టడం కష్టంగా మారడంతో మృతుని వివరాలు తెలియరాలేదు. ఈ ప్రాంతంలోనే హత్య చేశారా ? లేక వేరే చోట హత్య చేసి ఇక్కడ దహనానికి యత్నం చేశారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.