వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోటీ

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోటీ - Sakshi


హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని, అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు.



ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమ పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీయే బ్రహ్మాస్త్రం అని లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ మత రాజకీయాలు చేస్తోందని, మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ వీరికి మద్దతుగా ప్రచారం చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top