‘తప్పు మాది కాదు.. సీఎంలిద్దరిదీ’


హైదరాబాద్: హైకోర్టు విభజన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కారం చేసుకోవాల్సిన అంశంకాగా కేంద్ర ప్రభుత్వంపై నింద వేయటం సరికాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అమరావతికి కేసీఆర్, చండీయాగానికి చంద్రబాబు వెళ్లారు కదా...అప్పుడెందుకు హైకోర్టు విషయం వారు మాట్లాడుకోలేదని ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే నాటకాలాడుతున్నాయని తప్పుపట్టారు.


ఏపీ హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం రూ.100 కోట్లు కేటాయించిందని లక్ష్మణ్ గుర్తు చేశారు. ప్రతి అంశాన్నీసెంటిమెంట్ పేరుతో రాజకీయం చేసే పరిస్థితి మానుకోవాలని అధికార టీఆర్‌ఎస్‌కు హితవు పలికారు. న్యాయవాదుల ఆందోళనకు తమ పార్టీ మద్దతు ప్రకటిస్తోందన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారాన్ని, ఆప్షన్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని కోరారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top