బస్సుభవన్ ముట్టడికి యత్నం


హైదరాబాద్: పెంచిన విద్యత్, బస్సు చార్జీలకు నిరసనగా నగర బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం బస్సు భవన్ ఎదుట ధర్నా చేశారు. బస్సు భవన్ ముట్టడికి యత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top