బైక్ దొంగల అరెస్ట్... 30బైక్లు స్వాధీనం
వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ కరుడుగట్టిన దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను మీర్పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30ద్విచక్ర వాహనాలనుస్వాధీనం చేసుకున్నారు. మీర్పేట, వనస్థలిపురం, హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్, ఆదిబట్ల, ఉప్పల్, మహేశ్వరం పోలీస్స్టేషన్ పరిధిలో వీరు బైక్లను చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు.