మనార... మెచ్చుకొనెరా!
అందాల తార మనార చోప్రా సోమవారం నగరంలో సందడి చేశారు. బేగంపేట్లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. త్వరలో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా రూపొందనున్న ఓ చిత్రంలో నటించనున్నట్టు చెప్పారు. హైదరాబాదీయులు ఆత్మీయత పంచుతారని మెచ్చుకున్నారు. బాలీవుడ్ నటి మనార చోప్రా (ప్రియాంక చోప్రా సోదరి) నగరంలో సందడి చేశారు. శ్రీ సారో నటరాజ్ ఆయిల్ గ్రూప్నకు చెందిన ఫైటర్ ప్లస్ రిఫైండ్ ఆయిల్ను సోమవారం మార్కెట్లోకి లాంచ్ చేశారు.
బేగంపేట్ హోటల్ మ్యారి గోల్డ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె సిటీపై ప్రేమ కురిపించారు. హైదరాబాదీలు ఆత్మీయతను పంచుతారని, ఇక్కడి ఆతిథ్యం అద్భుతమని కితాబిచ్చింది. ప్రస్తుతం హిందీలో ఒక చిత్రం, తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నట్టు చెప్పింది. - సనత్నగర్