అబద్ధాలు చెబుతూ ఎన్నాళ్లు పాలిస్తావ్?


తెలంగాణ సీఎంపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం



సాక్షి, హైదరాబాద్: ఒక్క జాతిగా ఉన్న తెలుగు ప్రజలను విడగొట్టి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఇస్తే పాలించుకోలేక ప్రజలకు అబద్ధాలు చెబుతూ ఉసిగొల్పడం పద్ధతిగా లేదని, ఇలా ఎన్నాళ్లు పాలిస్తావంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌నుద్దేశించి ఆంధ్రప్రదేశ్ కార్మికమంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం విమర్శించారు.  భవన నిర్మాణరంగ కార్మిక సంక్షేమ బోర్డులోని నిధులను విజయవాడకు పట్టుకుపోతున్నారన్న ప్రచారం చేసి ఏపీ అధికారిపై పోలీసులు, గూండాలతో దాడులు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top